టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు భారీ విరాళం
- టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం
- కోల్కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ రూ. 2.50 కోట్లు విరాళం
- పేద రోగుల వైద్య సేవలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్న టీటీడీ ఛైర్మన్
- తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేసిన ఫౌండేషన్ ట్రస్టీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందింది. కోల్కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ సంస్థ రూ. 2.50 కోట్లను విరాళంగా అందజేసింది. తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో నిన్న ఈ కార్యక్రమం జరిగింది.
హిమాద్రి ఫౌండేషన్ ట్రస్టీ అనురాగ్ చౌదరి, ఈ విరాళానికి సంబంధించిన రూ. 2.50 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. "పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని" ఆయన వివరించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు టీటీడీ ఈ ట్రస్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.
హిమాద్రి ఫౌండేషన్ ట్రస్టీ అనురాగ్ చౌదరి, ఈ విరాళానికి సంబంధించిన రూ. 2.50 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. "పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని" ఆయన వివరించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు టీటీడీ ఈ ట్రస్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.